కడప జిల్లాలో నాసిరకం విత్తనాల శనగల పంపిణీపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సొంతజిల్లాలోనే ఇంత దారుణమా అంటూ రైతులు నిరసన తెలిపారు. మార్కెట్ యార్డులలో సబ్సిడీ విత్తనాలుగా ఇచ్చే ఇరవై ఐదు కేజీల సంచులలో పది కేజీలు సచ్చు-పుచ్చులు గింజలు ఉంటున్నాయని, ఇక మిగతా యాభై శాతం పొలంలో వేస్తే పంట ఎంతవరకు వస్తుందోనని రైతులు భగ్గుమంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని రైతులు మండిపడుతున్నారు.