రైతులకు ఉచితంగా బోర్లు వేసేందు కోసం 200 డ్రిల్లింగ్ బోర్ మెషీన్లు కొనుగోలు చేయనున్నట్లు ఏపీ మంత్రి పేర్నినాని తెలిపారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇసుక రవాణా కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా 6వేల వాహనాల కొనుగోళ్లకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. వైఎస్సార్ ఆదర్శం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు యువతకు అవకాశం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు.