రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు అరుణాచల్ప్రదేశ్ సీఎం పెమాఖండూ సాహసం చేశారు. బైక్పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బైక్ రైడింగ్, సాహస క్రీడలకు ప్రసిద్ధి గాంచిన రాష్ట్రంలోని పాసిఘాట్ వైపు పర్యాటకుల్ని ఆకర్షించేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్పై 122 కిలోమీటర్లు ప్రయాణించి పర్యాటకుల దృష్టిని ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.