ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 10వ తేదీన అనంతపురం జిల్లా పర్యటిస్తారని మంత్రి శంకర్ నారాయణ మీడియాకు చెప్పారు. ఆదివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ ప్రపంచ కంటి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని, ఐదు కోట్ల మంది ప్రజల కోసమే కంటివెలుగు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల, పీటీసీ మైదానాలను పరిశీలించామని చెప్పారు. . తొలిదశలో విద్యార్థులకు కంటి పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ సత్యయేసుబాబు లు పాల్గొన్నారు.