ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2019, 11:48 AM

రాజమండ్రి:  జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా... చిన్నారితో సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు మండలం మడికి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మామిడూరు గ్రామానికి చెందిన చరుమూరి రామస్వామి (65) కారులోనే ప్రాణాలు వదిలారు. మిగిలిన ఐదుగురు కుటుంబ సభ్యులకు గాయాలు కావడంతో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com