రాజమండ్రి: జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా... చిన్నారితో సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు మండలం మడికి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మామిడూరు గ్రామానికి చెందిన చరుమూరి రామస్వామి (65) కారులోనే ప్రాణాలు వదిలారు. మిగిలిన ఐదుగురు కుటుంబ సభ్యులకు గాయాలు కావడంతో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది.