ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదలతో లోతట్టుప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. యూపీ, బీహార్ లోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గంగానది ఉధృతితో బీహార్ లోని పలు జిల్లాలు నీట మునిగాయి. యూపీలో వరదలకు ఇప్పటివరకు 75 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. చాలా ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బీహార్ లో చాలా జిల్లాలు వరద నీటిలో మునిగిపోయాయి. సేఫ్ బోట్ ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.