‘అనర్హులూ’ అయితేనేం రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఎన్నికల సంఘం తేల్చి చెప్పటంతో వాంతా ఇప్పుడు మరోమారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇటీవల కన్నడ నాట ఫిరాయింపు నిషేధ చట్టం కింద అనర్హులైన 17 మంది శాసనసభ్యులు ఉప ఎన్నికల్లో పోటీకి అనుమతించాలని దాఖలు చేసిన వినతిని అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ఈసి ఇచ్చిన వివరణలు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసాయి.
కాంగ్రెస్, జేడీఎస్, పార్టీలకు చెందిన 17మంది తిరుగుబాటు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడగా 15 స్థానాలకు వచ్చే నెల 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను నిలుపుదలకు ఉత్తర్వులు జారీ చేయాలని సదరు 15 మంది శాసనసభ్యులు ధర్మాసనాన్ని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్పై విచారించిన సుప్రీం జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కర్నాటక రాష్ట్రం, విధానసభ సభాపతికి వివరణ తాఖీదుల్ని జారీ చేసింది.
కాగా ఇదే కేసుపై తన వివరణలు అందించిన ఈసీ షెడ్యూల్ ప్రకారమే ఉపఎన్నికలు జరుగుతాయని వివరించింది. ‘ఎన్నికలపై స్టే ఇవ్వడం కుదరదు. శాసనస భాపతి అనర్హత వేటు వేయగలరు కానీ ఎన్నికల నుంచి పోటీ చేయకుండా అడ్డుకోలేరు’ అని నివేదించింది. అనర్హ ఎమ్మెల్యేలు ఉపఎన్నికల్లో పోటీ చేయ వచ్చని ఎన్ని కల సంఘం తేల్చి చెప్పింది. దీంతో తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది ధర్మాసనం.