పేకాడితే పెళ్లాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుందన్న పెద్దల సామెతను ఓ ఘనుడు నిరూపించాడు. పేకాడుతూ సర్వం కోల్పోయి చిల్లి గవ్వలేని స్థితిలో కట్టుకున్న భార్యను తాకట్టు పెట్టాడు. జూదానికి బానిసై ఇల్లు, ఆస్తులు అమ్ముకుని ఘోరమైన స్థితిలో ఉన్న నీచుడికి భార్యే కనపడింది. చివరికి ఇంట్లో నలుగురు స్నేహితులతో పేకాడుతూ భార్యను పంజం కాసి ఓడిపోయిన భర్త కళ్లప్పగించి చూసిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కల్యాణ్ పూర్ కు చెందిన ఓ వ్యక్తి డ్రగ్స్, మద్యానికి బానిసై కుటుంబాన్ని గాలి కొదిలేశాడు. ఈ క్రమంలో అతడికి పేకాట అలవాటుగా మారి జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఇంటా, బయట ఎక్కడికి వెళ్లినా రాత్రి ఒంటి గంట, రెండు గంటల వరకు జూదం ఆడేవాడు. ఈ క్రమంలో సెప్టెంబరు 15న తన నలుగురు ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని కబురు పెట్టాడు. వారు వచ్చేటప్పుడు మద్యం, చికెన్ తీసుకుని వచ్చారు. మద్యం సేవిస్తూ పేకాట ప్రారంభించారు. ఇప్పటికే పేకాడి సర్వం కోల్పోయిన ఆ ఘనుడు మళ్లీ ఇంట్లో పేకాడుతూ మొత్తం తాకట్టు పెట్టాడు. ఎలాగైన పేకాడి గెలిచి తీరాలన్న కసితో మొత్తం పోగొట్టుకున్నాడు. ఆటలన్నింటిలో ఓడిపోవడంతో ఇల్లు, చేతులు ఖాళీ అయ్యాయి.
సర్వం కోల్పోయి డిప్రెషన్ లో ఉన్న ఆ వ్యక్తి ఎలాగైన గెలవాలని తన భార్యను తాకట్టు పెట్టాడు. చివరికి ఓడిపోవడంతో నోరెళ్ల బెట్టి చూసాడు. గెలిచిన నలుగురు వ్యక్తులు బరితెగించి ఆమెపై అత్యాచారానికి యత్నించారు. వారి నుంచి తప్పించుకుని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్ట్ చేసి వెంటనే రిలీజ్ చేశారు. ఇది భార్య భర్తల గొడవని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు మొరపెట్టుకోవడంతో అక్కడి చేరుకున్న స్థానికులు పోలీసుల తీరుపై మండిపడ్డారు.