ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పుడు పరిష్కరించకపోతే తరతరాలకు సమస్యే...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2019, 07:09 PM

పాడేరు డంపింగ్ యార్డు తీవ్ర సమస్యగా మారింది. స్థానిక ఐటీడీఏ వెనుక అర కిలోమీటర్ దూరం కూడా లేని ఈ యార్డు స్థానికంగా నివసిస్తున్న వారిని వివిధ రోగాల బారిన పడేలా చేస్తుంది. పాడేరు పట్టణం ఆధునిక కాలంలో రోజురోజుకీ విస్తరించుకు పోవడంతో ఈ చెత్త వేసే ప్రదేశం పట్టణం మధ్యలోకి దగ్గరగా వచ్చేసింది. ఈ చెత్త వేసే ప్రదేశం గుండా ప్రవహించే నీటి ఊటలు పాడేరు కి ఆనుకొని ఉన్న కొన్ని వేల ఎకరాల పొలాలకు, వందల ఎకరాల కాఫీ తోటల పంటలు పండడానికి ఆధారంగా ఉన్నాయి. అయితే ఇక్కడ పాడేరు గ్రామ పరిసరాల్లో ఉన్న వివిధ రకాల చెత్త తో పాటు ఆసుపత్రి వ్యర్థాలు, ప్లాస్టిక్, కళేబరాలు, వంటివి ఇక్కడ నిల్వ చేసి తగుల పెట్టడంతో వాతావరణం భూమి నీరు పూర్తిగా కలుషితం అవుతోంది.


ఈ చుట్టూ ప్రక్కల కొండ కొనల నుండి వచ్చే ఊట నీరు ఇక్కడ భూమి వాతావరణం కలుషితం అవుతున్నాయి. గతం లో అధికంగా పండే ఈ పంటలు ప్రస్తుతం అంతంత మాత్రంగా పండుతున్నాయంటున్నారు స్థానిక గిరి రైతులు. ఇక్కడ ఉన్న ఈ డంపింగ్ యార్డు ని గ్రామాలకు దూరంగా తరలించక పోతే ఇక్కడ నుండి పుట్టే ఊట నీరు పూర్తిగా అంతరించిపోయి పంటలు పండించే అవకాశం కోల్పోతామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఇక్కడ వ్యర్థాలు వేసే చోటు వేరే చోటికి తరలించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com