ట్రెండింగ్
Epaper    English    தமிழ்

24న జగన్, కేసీఆర్ సమావేశం..ఎందుకో తెలుసా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2019, 12:39 PM

ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న సమావేశం కానున్నారు. గోదావరి నది నీటిని కృష్ణా బేసిన్ కు తరలించే విషయమై చర్చించేందుకు ఈ సమావేశం జరుగనుంది. ఈ విషయమై ఇప్పటికే జగన్, కేసీఆర్ ఓ అంగీకారానికి వచ్చారు. ఈ విషయంలో అధ్యయనం చేసేందుకు ఇరురాష్ట్రాల్లో ఇంజనీర్లతో అధ్యయన కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ నివేదికలు అందినప్పటికీ ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యేందుకు కుదరలేదు. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్ లో ఈ నెల 24న ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఈ భేటీలో ఇరురాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులు కూడా పాల్గొననున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com