వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గ్రామ సచివాలయ, వార్డు ఫలితాలను గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వైబ్ సైట్లో చూసుకోవచ్చు. 1.26లక్షల ఉద్యోగాలకు ఈనెల 1 నుంచి 8వ తేదీ వరకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా 19.74లక్షల మంది హాజరయ్యారు. పరీక్షలకు ఎంపికైన వారు వచ్చేనెల మొదటివారంలో ఉద్యోగంలో చేరనున్నారు.