ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత వినోద్ ఖన్నా కొద్దిసేపటి క్రితం ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.1968లో సినీ రంగ ప్రవేశం చేసిన వినోద్ ఖన్నా తనదైన నటన డైలాగ్స్ డెలివరీతో అభిమానులను ఆకట్టుకున్నాడు. విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన తరువాత హీరోగా మారి 141 చిత్రాల్లో నటించారు. ఆయన చివరి చిత్రం 'దిల్ వాలే'. నటుడిగానే కాక రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు వినోద్ ఖన్నా 2002లో వాజ్ పాయ్ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. 2014లో గురుదాస్ పూర్ నుంచి వినోద్ ఖన్నా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. వినోద్ ఖన్నా మృతిపై బాలీవుడ్ వర్గాలు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపాయి.