న్యూఢిల్లి : కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం కష్టకాలం నడుస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లి మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నారు. ఢిల్లి మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం పట్ల షీలా దీక్షిత్ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో ముమ్మర ప్రచారం చేయలేదని చెప్పారు. ఢిల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన స్థాయిలో కాంగ్రెస్ కృషి చేయలేదని ఆమె చెప్పారు. ఎన్నికల్లో ప్రచారానికి తనను ఆహ్వానించలేదని ఆమె చెప్పారు.