ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు చూస్తున్నారు !  

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2019, 03:28 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి తనకు రహస్య సమాచారం అందిందని చెప్పారు. మరోవైపు తిరుపతి ఏపీ రాజధాని కావడం ఖాయమని చెప్పారు. సీఎం జగన్ అమరావతిని వదిలి తిరుపతికి రావాలని సూచించారు. రాష్ట్ర రాజధానిగా తిరుపతి అన్ని విధాలా అనువైనదని చెప్పారు. అమరావతికి వరద ముప్పు ఉందని... రాజధానిగా ఆ ప్రాంతం అనువైనది కాదని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చింతా మోహన్ పైవ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com