తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి రిలయన్స్ సంస్థ తరపున ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) పీఎంఎస్ ప్రసాద్ రూ.1.11 కోట్ల విరాళాన్ని సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకుని తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు కింద డిపాజిట్ చేయాలని సూచించారు.