ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణాన్ని కొనసాగనీయబోమన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంలోని ఒకరు కేంద్రానికి తెలిపారన్నారు. 4 ప్రాంతాల్లో 4 రాజధానులు పెట్టే వైకాపా సర్కారు యోచనను ప్రజలు స్వాగతిస్తారని తెలిపారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో పెట్టుబడులు పెడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు విడిపోవడం ఖాయమని, పెట్టుబడుల వికేంద్రీకరణ జరగడం మంచిదని సూచించారు. గోదావరి నీళ్లను శ్రీశైలానికి ఇస్తామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కేసీఆర్తో ఎవరు కలిసినా నాశనం తప్పదని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టును ఆపడం మంచిది కాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీనిని వైఎస్ ప్రారంభించారని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కొనసాగించారని గుర్తు చేశారు.