టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా వరద ముంపు బాధితులను పరామర్శించారు. విపత్తుల సమయంలో నష్టపోయేది పేద ప్రజలేనని, ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉండాలని, వరదల గురించే తప్ప ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడనున్నారు. గ్రామాలలోకి వచ్చిన నేతలను నిలదీయాలని, ప్రభుత్వం బాధితులకు చేసిన సాయమేంటో.. ఇచ్చిన పరిహారమేంటో.. ఆదుకోవటానికి తీసుకున్న చర్యలేంటో నిలదీయాలన్నారు.