వరదల మాటున అప్ ప్రభుత్వ మంత్రులు చంద్రబాబు భద్రతకు ముప్పుతలపెట్టే యత్నంలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ నేతల బృందం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం గవర్నర్ ను కలిసేందుకు వారు అపాయింట్మెంట్ తీసుకున్నట్టు సమాచారం . వరదల్లో జనం అల్లాడు తున్న.. చంద్రబాబు ఇంట వద్ద మాత్రమే నీటి ప్రవాహం కొలిచే పేరుతొ డ్రోన్ల ప్రయోగంపై గవర్నర్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. డ్రోన్ల ప్రయోగంపై గుంటూరు రేంజ్ ఐజీకి టీడీపీ ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.