విజయవాడ, సూర్య బ్యూరో : నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్, డిగ్రీ, బిఈడీ, లా కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి గంటా మాట్లాడుతూ మే 15 నుంచి తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. కళాశాలలకు, స్కూళ్లకు అనుబంధంగా నడిచే హాస్టల్స్కు అనుమతులు తప్పనిసరి అన్నారు. ఇష్టానుసారం కళాశాలల యాజమాన్యాలు అనుబంధంగా హాస్టల్స్ ఏర్పాటు చేసుకోవడంపై మంత్రి గంటా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీటిపై చర్యల తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవ్వరి కళాశాలైనా సరే నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకుంటే చర్యలు తప్పవన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంకల్లా మౌలిక సదుపాయాలు, ల్యాబ్లు ఏర్పాటు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసిన మంత్రి అనుమతులు లేని విద్యాసంస్థలపై తల్లిదండ్రుల్లో అవగాహన తెచ్చేలా ప్రకటనలు ఇవ్వాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి సంస్కరణలలో భాగంగా విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే లోపే టీచర్ల బదిలీలు, స్కూళ్ల రేషనలైజేషన్ పూర్తి చేస్తామని మంత్రి అన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమీషనర్ ఉదయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.