ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఇళ్లపట్టాలు అందించే విధానంపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించింది. కమిటీలో సభ్యులుగా గృహ నిర్మాణ, ఆర్థిక, సామాజిక సంక్షేమ శాఖ కార్యదర్శులు, కమిటీ కన్వీనర్ గా భూపరిపాలన ప్రత్యేక కమిషనర్ ఉన్నారు. వచ్చే ఏడాది ఉగాది నాటికి 25లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.