ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో చర్చించడానికి అవకాశమే ఇవ్వడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ నుండి వాకౌట్ చేసి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలకు భద్రత, భరోసా ఇవ్వాలని, టిడిపి శ్రేణులపై వైసిపి దాడులు పెరిగిపోతున్నాయని, అధికారంలోకి వచ్చినప్పటి నుండి దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇప్పటివరకు 285 దాడులు మావాళ్లపై జరిగాయన్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే చట్టం ముందు దోషులుగా నిలబడతారని, 70 ఏళ్ళ వయసున్న వారిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఎవ్వరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలన్నారు.