రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు దుయ్యబట్టారు.గుంటూరులో ఆయన మాట్లాడుతూ… రాజధాని, పోలవరం పనుల్లో అవినీతి జరిగిందనేది అవాస్తవమన్నారు. ఆరోపణలు చేసే వారు ఆధారాలతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం మసకబారిందని, ప్రత్యేక హోదా సాధనకు కట్టుబడి ఉన్నామన్న వారే ఇప్పుడు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇసుక విధానంపై ప్రభుత్వానికి స్పష్టత లేదని, భవన నిర్మాణ కార్మికుల ఆందోళనకు టీడీపీ సంపూర్ణ మద్దతిస్తుందని కోడెల చెప్పారు.