బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్ ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఫిరాయింపుల విషయంలో ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులు బీజేపీలో చేరడానికి రాజీనామాలు చేయాలన్న అంశం అడ్డంకిగా మారిందని అభిప్రాయపడ్డారు. కేవలం టీడీపీ నేతలే కాకుండా కాంగ్రెస్ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా టచ్ లో ఉన్నారని ప్రకటించారు. విజయవాడలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడారు. అంతకు ముందు టీడీపీ హయాంలో జరిగిన విద్యుత్ పీపీఏ ఒప్పందాల జోలికి వెళ్లవద్దని సీఎం జగన్ ను మాధవ్ కోరారు. విద్యుత్ ఒప్పందాలపై కేంద్రం రాసిన లేఖలను గౌరవించాలని సూచించారు. అమరావతి నిర్మాణం తమ తొలి ప్రాధాన్యం కాదని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడంతో ఏపీలో నిర్మాణ రంగం కుదేలయందని వ్యాఖ్యానించారు.