చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. వీరు ముగ్గురు ప్రయాణిస్తున్న బైక్.. పక్క నుంచి వెళ్తున్న మరో బైక్ను ఢీకొట్టి అదుపుతప్పి బస్సు కిందికి దూసుకుపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.