కర్ణాటకలో పొలిటికల్ డ్రామా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై మీడియాతో మాట్లాడిన ప్రతిపక్ష నేత యడ్యూరప్ప సీఎం కుమారస్వామి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. 15 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు రాజీనామా చేశారని, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారని, మద్దతులేని కారణంగా తనకు తానుగా రాజీనామా చేసి తప్పుకుంటే మంచిదన్నారు.