రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని విధాలుగా సహకరిస్తామని ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం సీఎం తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా చర్చలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ… ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నామని అన్నారు. హోదా పేరుకు ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదు.. అందుకే పేరు మార్చి ప్యాకేజీ ప్రకటించారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తానెప్పుడూ రాజీపడలేదని, 29 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేశానని వివరించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం హోదా కోసం చేసే ప్రయత్నాలకు అన్నివిధాలుగా సహకరిస్తామని చంద్రబాబు వెల్లడించారు.