విజయవాడ, మేజర్న్యూస్ : ఏఐసిసి మార్గనిర్దేశం చేసే కార్యక్రమాల నిర్వహణ అమలుకు జిల్లా కమిటీ చైర్మన్లులుగా నియమిస్తున్నట్లు ఏపీ పీసీసీ ప్రకటించింది. గురువారం ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి కమిటీల జాబితాను ప్రకటించారు. జిల్లా స్థాయిలో ఈ కమిటీనే పెద్ద నోట్లు రద్దుకు వ్యతిరేక ప్రచార కమిటీ చైర్మన్లుగా వ్యవహారిస్తారు అన్నారు. జిల్లా కమిటీలో జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, 2014 ఎన్నికల్లో పోటి చేసిన ఎమ్మెల్యే, ఎంపిలు మరియు నియెజకవర్గం ఇన్చార్జీలు సభ్యులుగా ఉంటారన్నారు. రాష్ర్ట స్థాయిలో పెద్ద నోట్లు రద్దుకు వ్యతిరేక ప్రచార కమిటీ చైర్మన్గా ప్రతిపక్షనేత, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య పాటు మరో 21 మంది సభ్యులతో కమిటీని నియమించిన విషయం విధితమే. ఏఐసీసీ ఎప్పటికప్పడు రూపొందించిన కార్యక్రమాలను సదురు కమిటీ కీయశీలక పాత్ర పోషించి కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. ఏఐసీసీ మార్గనిర్దేశంచేసే కార్యక్రమాల నిర్వహణ అమలు కమిటీ మరియుపెద్ద నోట్లు రద్దుకు వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా చైర్మన్లు