ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవ్యాంధ్రలో ఇ+ప్రగతి పాలన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 17, 2017, 01:36 AM

-శరవేగంగా జరుగుతున్న పనులు  


-ఫైబర్‌ గ్రిడ్‌ మొదటి దశ పూర్తి  


-133 ప్రభుత్వ విభాగాల్లోని సేవలన్నీ డిజిటలైజేషన్‌  


-745 సేవల అనుసంధానం 


అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర మంత్రి మండలి 2017-18ని ఇ-ప్రగతి పాలన సంవత్సరంగా ప్రకటించింది.  రాష్ట్రంలో ఇ- ప్రగతి ప్రాజెక్‌‌ట పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిజిటల్‌ ఇండియా స్ఫూర్తితో సమాచార, సాంకేతిక రంగాల్లో దేశంలోనే అత్యున్నతంగా నిలిపేం దుకు 'ఇ-ప్రగతి' ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్రం డిజిటల్‌ ఇండియాను రూపొందించడంతో అన్ని రాషా్టల్ర కన్నా ముందే దాని అమలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. కేంద్ర సంస్థలు వచ్చే వరకు ఆగకుండా రాష్ట్రంలో తామే జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును నిర్మించుకుంటామని ప్రకటించింది. ఇలా ప్రకటించిన ఘనత ఏపీకే దక్కుతుంది. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఇ-ప్రగతిపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఇ-ప్రగతి పనులు ముమ్మరంగా జరగాలని నిర్ణయించారు. ఈ సారి జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సు నాటికి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆన్‌ లైన్‌ లోనే జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఆదేశించారు. ప్రతినెలా ఒక కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించాలన్నారు. ఏ ఏ శాఖలను మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందో ముందు గుర్తించాలని చెప్పారు. ఇ-ప్రగతి ప్రాజెక్‌‌ట లో ప్రధానంగా భాగం కావలసినవి పీపుల్‌‌స హబ్‌, ల్యాండ్‌ హబ్‌, ఇ-నిధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తిచేయాలన్నారు.  ఇ-ప్రగతిలో లోకలైజేషన్‌, టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌, హైబ్రిడ్‌ క్లౌడ్‌, సన్‌ రైజ్‌ స్కోర్‌ బోర్‌‌డ, సైబర్‌ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్‌‌స, ప్రైమరీ సెక్టార్‌, ఎడ్యుకేషన్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, కార్‌‌డ ప్లస్‌ ప్లస్‌, ఇ-ప్రగతి కోర్‌, పెర్ఫార్మెన్‌‌స మేనేజ్‌మెంట్‌, స్మార్‌‌ట వాటర్‌, సేఫ్‌ ఏపీ, హెల్‌‌త ప్రాజెక్టులుగా సీఎం వివరించారు. గ్రామస్థాయి నుంచి అన్ని ఫైళ్లు ఆన్‌లైన్‌లో ఉంచాలని, ప్రతి ఫైలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.  రికార్డుల ఇ-ఫైలింగ్‌ ఎంత మేర పూర్తయ్యింది? చట్టబద్దంగా హార్‌‌డ కాపీలను ఎలా భద్రపరచాలి? అనే అంశాలపై పూర్తి వివరాలను వచ్చే కలెక్టర్ల  సమావేశం నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలపాలన్న ఉద్ధేశంతో 2015 జులైలో  ఇ-ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. ఫైబర్‌ గ్రిడ్‌తో రాష్ట్రం మొత్తం అనుసంధానం చేసే కార్యక్రమం పూర్తి కావస్తోంది. ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా రాష్ట్రంలో సాంకేతిక విప్లవం మొదలైంది.  ఇంటర్నెట్‌, మొబైల్‌ విప్లవంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఈ రోజు బ్రాడ్‌ బ్రాండ్‌ లేని గ్రామం లేదు. అత్యధికులు ఇంటర్నెట్‌ వాడుతు న్నారు. ఈ తరుణంలో బ్రాడ్‌ బ్రాండ్‌ విప్లవం ద్వారా అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్‌నెట్‌ సేవల తొలి దశ పూర్తి అయింది. ఫైబర్‌ నెట్‌ సేవలు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లె మండలం మోరీ, మోరిపోడు గ్రామాల్లో గత నెలలో మొదలయ్యాయి. ఏపీఎస్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) ఆధ్వర్యంలో ఫైబర్‌ గ్రిడ్‌ పనులు జరుగుతున్నాయి. మొదట ఈ రెండు గ్రామాల్లోని పాఠశాలలతోపాటు 1200 ఇళ్లకు ఫైబర్‌ నెట్‌ సేవలు అందించే ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలందించడానికి ఏర్పాట్లు చేశారు.  తొలి దశలో పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఎంఎస్‌ఓ(మల్టీ సిస్టమ్‌ ఆపరేటర్‌)లు, ఎల్సీఓల ద్వారా  ఫైబర్‌ నెట్‌ సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు పది వేల నెట్‌ కనెక్షన్లు ఇచ్చారు. మంత్రి మండలి సమావేశంలో ఫైబర్‌ గ్రిడ్‌ పై అధికారులతో సీఎం చర్చించారు. ఈ నెలాఖరునాటికి లక్ష బాక్సులు అమర్చాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ 15 నాటికి పది లక్షల కనెక్షన్లు ఇచ్చే ఏర్పాటు చేయాలన్నారు. దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలలో కూడా  ఫైబర్‌ గ్రిడ్‌ సేవలు అందిస్తారు. విస్తృత స్థాయిలో ఈ సేవలను వినియోగించుకోవాడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో మొత్తం లక్షా 30 వేల కనెక్షన్లు ఇవ్వవలసి ఉంది. ఈ ప్రాజెక్టుని ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలన్నది లక్ష్యం. దేశంలో ఇటువంటి పథకం చేపట్టిన రాష్ట్రం మనదే.   ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు 8 జిల్లాలలో ఈ పనులు పూర్తయ్యాయి. మిగిలిన జిల్లాలలో కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మొత్తం 23,500 కిలో మీటర్ల ఆప్టికల్‌ ఫైబర్‌ లైన్లు ఏర్పాటు చేయవలసి ఉంది. అందులో  22 వేల కిలో మీటర్లకుపైగా లైన్లు పూర్తయ్యాయి.  ఇప్పటికే ప్రభుత్వ విభాగాలన్నింటిలో డిజిటలైజేషన్‌ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. కొన్ని శాఖల్లో నూరు శాతం  పూర్తయింది. ఈ విధంగా కొత్త శకానికి నాంది పలికి దేశంలో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందింది.  పారదర్శక పాలన, పౌరులందరికీ సత్వర సేవలు  అందించేందుకు 133 ప్రభుత్వ విభాగాలలో అన్నిరకాల సేవలను డిజిటలైజేషన్‌ చేస్తున్నారు. 33 శాఖలు, 315 సంస్థలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కిటెక్చర్‌ (ఏపీఎస్‌ఈఏ)లో భాగంగా మొత్తం 745 సేవలను అనుసంధానం చేసేలా ఇ-ప్రగతి రూపకల్పన జరిగింది. ఇటువంటి ప్రాజెక్టు చేపట్టిన రాష్ట్రం దేశంలోనేకాదు దక్షిణాసి యాలోనే మొదటిది ఏపీ. వాస్తవానికి ఇది ఒక ప్రాజెక్టు కాదు. పరిణామ క్రమంలో కాలానుగుణంగా వచ్చే సాంకేతిక మార్పులు, అవసరాలు, వ్యూ హాలు, నూతన ఆవిష్కరణలను అనుసరించి నిరంతరం కొనసాగే ఒక సాంకేతిక ప్రక్రియ. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని  పరిపాలనకు అన్వయించడం ద్వారా సర్టిఫికెట్‌ లెస్‌ గవర్నమెంట్‌ సిస్టమ్‌ (సీఎల్జీఎస్‌), డయల్‌ ఏపీ, మన రాష్ట్రం, టెలీహెల్‌‌త, ఇ-ఎడ్యుకేషన్‌, హరిత, ఇ-మండీ, సిటిజెన్‌ ఇన్‌ బాక్‌‌స, డిజిటల్‌ లిటరసీ, ఇ-ఎస్‌హెచ్‌జీ, స్మార్‌‌ట సిటీ, స్మార్‌‌ట గ్రిడ్‌ తదితర సేవలన్నీ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రజల ఆరోగ్యం, పాఠశాలల్లో డ్రాపవుట్‌ రేటు తదితర ప్రామాణికాల నిర్దారణకు ఇ-ప్రగతి ప్రాజెక్టు ఉపకరిస్తుంది. మీ సేవ, సీఎం డ్యాష్‌ బోర్డు, మీ భూమి తదితర కామన్‌ ఆప్లికేషన్లతో పాటు ఆర్థిక, సీఆర్‌డిఏ, పట్టణాభివృద్ధి వంటి ప్రభుత్వ శాఖల సమగ్ర సమాచారాన్ని పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. కేటగిరిలవారీగా, అన్ని వయసుల వారికి సమగ్ర సమాచారం  అందించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఇందులో భాగంగానే స్మార్‌‌ట పల్‌‌స సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, డిజిటలైజ్‌ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు 1,37,42,586 కుటుంబాలకు చెందిన 4,32,55,924 మంది వివరాలు సేకరించారు.  ఇ-ప్రగతి ద్వారా అన్ని శాఖల సమాచారాన్ని ప్రతి పౌరుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ప్రాథమిక రంగం మిషన్‌ లోని వ్యవసాయం, ఉద్యానవనాలు, మత్స్య పరిశ్రమ, పశు సంవర్ధకం తదితర అనుబంధ రంగాల సమాచారాన్ని ఇ-ప్రగతి ప్రాజెక్టు సేవల ద్వారా పొంద వచ్చు. పంటలు, భూములు, విత్తనాలు, బీమా, మార్కెటింగ్‌, ఇ-మండీ తది తర వివరాలన్నీ  లభ్యమవుతాయి.  మాన్యువల్‌గా చేసే వేల కొద్దీ పనులు ఈరోజు ఐటీ సహాయంతో వేగంగా చేయగలుగుతున్నారు. ఐటీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం, పనుల్లో వేగం సాధ్యమవుతుంది.  రెవిన్యూశాఖలో 113 సర్టిఫికెట్ల కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడేవారు. ఆ ఇబ్బందిని ఇప్పడు చాలా వరకు తగ్గించారు. ముందుముందు సర్టిఫికెట్‌లెస్‌ గవర్నెన్‌‌స సిస్టమ్‌ ప్రవేశపెడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల అవసరాలకు గతంలో మాదిరిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసి అవసరం ఇకముందు ఉండదు. ఇప్పటికే కుల, ఆధాయ ధృవీకరణ, ఇసీ, బీ1 అడంగల్‌ వంటి దాదాపు 600 సేవలు అందుబాటులోకి వచ్చాయి. లేబర్‌ లైసెన్సులు, పారిశ్రామిక అనుమతులు, అన్ని రకాల పన్నులు, ఇతర బిల్లుల చెల్లింపులు  వంటివి  ఆన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల, రాష్ట్రంలోని భూమి, లేఅవుట్లు, ఇళ్లు, రోడ్లు, దేవాలయాలు, భూగర్భజలాలు ఇలా ఒక్కటేమిటి సమగ్ర సమాచారం ఆయా శాఖల వెబ్‌సైట్‌లలో పొందుపరుస్తున్నారు. ఈ ప్రక్రియ శరవేగంగా జరిగిపోతోంది. ఇప్పటికే కొన్ని శాఖలు తమ పరిధిలోని  సమాచారాన్ని చాలా వరకు వెబ్‌ సైట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాయి. అందుకు నిదర్శనంగా పట్టణ గ్రామీణ ప్రణాళికా శాఖ (డీటీసీపీ-డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) వెబ్‌ సైట్‌ ను పేర్కొన వచ్చు. ఈ వెబ్‌సైట్‌లో రాష్ట్రంలోని సీఆర్‌ డీఏ మొదలుకుని పట్టణాభివృద్ధి సంస్థలు, నగరాలు, పట్టణాలు, నగర పంచాయితీల వంటి వాటి మాస్టర్‌ ప్లాన్లు, అనుమతి పొందిన లేఅవుట్లు, వాటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, సంబంధిత చట్టాల సమాచారం అంతా  ఉంది. ఆయా ప్రాంతాలలో లేఅవుట్లు, భవన నిర్మాణాలు, గ్రూప్‌ హౌస్‌ లు లాంటి అన్ని రకాల అనుమతులకు కావలసిన దరకాస్తులు ఉన్నాయి. అన్ని దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. ఫీజులను కూడా ఆన్‌ లైన్‌ లోనే చెల్లించవచ్చు. దరకాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి శాఖకు సంబంధించి అందుబాటులో ఉన్న పూర్తి సమాచారంతోపాటు ప్రతి పౌరుడి సమాచారాన్ని డిజిటలైజ్‌ చేస్తున్నారు. సీఎం డ్యాష్‌ బోర్డులో అయితే ప్రభుత్వ విభాగాలలో ఏ పని ఎంత వరకు జరిగిందో ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌ అవుతూ ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com