హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో.. విపక్షాల సమావేశం ఇవాళ జరుగుతున్నది. ఢిల్లీలో కాన్స్టూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో భేటీ మొదలైంది. డీఎంకే నేత కనిమొళి, బీఎస్పీ నేత దనిష్ అలీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అభిషేక్ మనూ సంఘ్వీలు సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా విపక్షాలు ఒకవేదికపై వచ్చాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలుబడిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు గురించి విపక్ష నేతలు చర్చిస్తున్నారు. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. నేతలంతా ఈ అంశంపై ఇవాళ ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. సీపీఎం నేత సీతారం ఏచూరి, టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్, ఆర్జేడీ నేత మనోజ్ జా, ఎన్సీపీ నేత మజీద్ మీమన్, ఎన్సీ నేత దేవిందర్ రాణాలు కూడా సమావేశానికి హాజరయ్యారు.