ఆల్వార్ గ్యాంగ్ రేప్ బాధితురాలికి పోలీసు ఉద్యోగం ఇవ్వాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్ కానిస్టేబుల్గా బాధితురాలికి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. తనకు పోలీస్ ఉద్యోగంలో చేరి తనపై జరిగినటువంటి అకృత్యాలను అడ్డుకోవాలని ఉందని ఇటీవల బాధితురాలు పేర్కొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వడానికి నిర్ణయించింది.