కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ ఎంపి దినేష్ త్రివేదీ అన్నారు. తనతో ప్రజలు ఉన్నారని, తాము ఎంతో అభివృద్ధి చేశామని ఆయన అన్నారు. తుపాకీల వైపు ఉండాలా? అభివృద్ధి వైపు ఉండాలా? అనే విషయంలో ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని ఆయన అన్నారు. బిజెపి అభ్యర్థి అర్జున్ సింగ్ ఒక మాఫియా అని ఆయన అన్నారు.