ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొలంబో ఎయిర్‌పోర్టు వద్ద ఐఈడీ బాంబు

national |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2019, 10:01 AM

కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబో ఎయిర్‌పోర్టు వద్ద ఆదివారం అర్ధరాత్రి ఐఈడీ బాంబును పోలీసులు గుర్తించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న దారిలో రోడ్డుపక్కన బాంబు ఉండడాన్ని గమనించిన పోలీసులు.. అనంతరం దాన్ని నిర్వీర్యం చేశారు. శ్రీలంక ఎయిర్‌ఫోర్స్‌ అధికార ప్రతినిధి గిహన్‌ సెనివిరత్నే మాట్లాడుతూ.. ఈ ఐఈడీ బాంబును స్థానికంగానే తయారు చేశారని, ఆరు ఫీట్ల పొడవున్న పైపులో బాంబును అమర్చారని ఆయన పేర్కొన్నారు. దీన్ని పోలీసులు ముందే గమనించడంతో పెనుప్రమాదం తప్పింది. ఆ బాంబును జాగ్రత్తగా నిర్వీర్యం చేశామన్నారు. శ్రీలంకలో ఆదివారం ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు వరుసగా ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుళ్ల ధాటికి వందల సంఖ్యలో మృతి చెందారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 290కి చేరుకోగా, వివిధ ఆస్పత్రుల్లో 600 మంది చికిత్స పొందుతున్నారు. ఈ వరుస పేలుళ్లకు సంబంధించి ఇప్పటి వరకు 24 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com