పలు తెలుగు సినిమాల్లో కూడా నటించిన రమ్య కర్ణాటక కాంగ్రెస్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంలో కూడా రమ్య క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక మోడీ మీద ఆమె హాట్ కామెంట్లలో చెలరేగిపోతూ కాంగ్రెస్ పార్టీలో హై లెవల్లో ఆమెకు గుర్తింపు తెచ్చుకుంది. రాజకీయంగా దుమారాలు రేపే వార్తల్లో నిలిచే రమ్య, ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ద్వారా విమర్శలకు గురి అవుతూ ఇప్పుడు అనూహ్యంగా వార్తల్లోకి వచ్చింది.
ఇప్పటికే జరిగిన రెండో విడత లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పద్నాలుగు సీట్లలో కర్ణాటకలో పోలింగ్ ముగిసింది. పోలింగ్ పూర్తి అయిన ఈ ప్రాంతానికి చెందిన ఓటరే. అయిన రమ్య తన ఓటు హక్కును వినియోగించుకోలేదని దుమారం రేగింది. ఈ విషయమై నెటిజన్లు ఆమెను ఓ ఆటాడుకుంటున్నారు. కాంగ్రెస్ నేతగా చలామణి అవుతూ, నువ్వు ఓటు హక్కు వినియోగించుకోకుండా, అందరి ఓట్లనూ అడగటమేంటని నెటిజన్లు ఆమెపై మండి పడుతున్నారు!