వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇంజక్షన్ వికటించిదని బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్నారి స్వగ్రామం నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామం వల్లూరు దీప్తి(4) గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. స్థానిక మిమ్స్ లో చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు చేర్పించారు. గురువారం జ్వరం తగ్గి ఇంటికి వెళ్లిపోదామనుకున్న సమయంలో సిస్టర్ ఇంజక్షన్ వేయడంతో మందు వికటించి చిన్నారి మృతి చెందిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.