ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన తెలుగు పంచాంగంను ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2017, 11:56 AM

 ఉగాది సందర్భంగా గుంటూరు బ్రాహ్మణ సంఘం ఆద్వర్యంలో రూపొందించిన నూతన తెలుగు పంచాంగంను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.  విజయవాడ ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేదపండితులు సంపెంగ మాలను జగన్ కు అందించి, వేదాశీర్వాదం ఇచ్చారు. అనంతరం సుమతీ శతకంతో కూడిన రజత ఫలకాన్ని జగన్‌కు అందచేశారు. నూతన తెలుగు సంవత్సరంలో జగన్ సేవలు ప్రజలకు మరింత చేరువకావాలని పండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పాశావజ్జుల పురుషోత్తమ శర్మ,  యేలేశ్వరపు జగన్మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com