ఉగాది సందర్భంగా గుంటూరు బ్రాహ్మణ సంఘం ఆద్వర్యంలో రూపొందించిన నూతన తెలుగు పంచాంగంను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. విజయవాడ ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేదపండితులు సంపెంగ మాలను జగన్ కు అందించి, వేదాశీర్వాదం ఇచ్చారు. అనంతరం సుమతీ శతకంతో కూడిన రజత ఫలకాన్ని జగన్కు అందచేశారు. నూతన తెలుగు సంవత్సరంలో జగన్ సేవలు ప్రజలకు మరింత చేరువకావాలని పండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పాశావజ్జుల పురుషోత్తమ శర్మ, యేలేశ్వరపు జగన్మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.