సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ రోజున స్పెషల్ పోలీసు ఆఫీసర్లుగా విధులు నిర్వర్తించేందుకు ఆసక్తి కల విశ్రాంత పోలీసు ఉద్యోగులు, మాజీ సైనికులు రావచ్చని అనంతపురము జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పోలింగ్ రోజుకు స్పెషల్ పోలీసు ఆఫీసర్లను సమీకరించుకోవడంలో భాగంగా ... శనివారం విశ్రాంత పోలీసు ఉద్యోగులు, మాజీ సైనికులు, ఎన్ ఎస్ ఎస్ , ఎన్ సి సి విభాగాలుతో ఎస్పీ తన ఛేంబర్లో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ ఏప్రిల్ 11 వ తేదీన పోలింగ్ విధులు నిర్వర్తించేందుకు మాజీ సైనికులు, విశ్రాంత పోలీసు ఉద్యోగులు, తదితరులను స్పెషల్ పోలీసు ఆఫీసర్లను తీసుకుంటామన్నారు. ఆసక్తి కల వారు సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ లేదా సబ్ డివిజినల్ పోలీసు అధికారి కార్యాలయంను సంప్రదించి వివరాలు తెలియజేయాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ కె చౌడేశ్వరి, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ ఎన్ టి వి రాంకుమార్ పాల్గొన్నారు.