హైదరాబాద్: తెలుగు కామెంట్రీతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలలో ఐపీఎల్ వీక్షకుల సంఖ్య అపారంగా పెరిగిందని, ఈ ఏడాది కూడా తెలుగులో వ్యాఖ్యానం అందిస్తున్నట్లు సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ఈవీపీ అండ్ బిజినెస్ హెడ్ ప్రసన్నకృష్ణన్ తెలిపారు. ఐపీఎల్ పదో సీజన్ సందర్భంగా 10 సాల్ ఆప్ కే నామ్ పేరిట ఆరు వాణిజ్య ప్రకటనలు ఆటను మరింతగా చేరువ చేస్తుందని చెప్పారు. ఈ ఏడాది మరింత మెరుగైన ప్రసారాలను అందిస్తామన్నారు. వేణుగోపాలరావు, వెంకటపతిరాజు, ప్రముఖ క్రీడా విశ్లేషకులు సీ వెంకటేశ్, చంద్రశేఖర్, సుధీర్ మహావాది, కళ్యాణ్ కృష్ణ ఐపీఎల్ మ్యాచ్లకు తెలుగులో వ్యాఖ్యానం అందించనున్నారు.