కేరళలోని కొచ్చిలో ప్రముఖ పాదరక్షల సంస్థ పారగాన్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్నాకులం దక్షిణ రైల్వే స్టేషన్ సమీపాన ఉన్న ఐదొంతస్తుల భవన సముదాయంలో బుధవారం సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో సమీపంలోని నివాసాల్లో ఉన్నవారిని తరలిస్తున్నారు. ఇప్పటికే అగ్నిమాపక దళాలు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.