కనిగిరి శాసనసభ్యులు కదిరి బాబూరావు బుధవారం వెలిగండ్ల మండలంలోని బల్లవరం, హుసున్ పురం, పద్మాపురం గ్రామాలలో పర్యటించడం జరిగినది. మొగల్లూర్ ఆర్.బి రోడ్డు నుండి బల్లవరం వరకు రూ. 2కోట్ల 20లక్షలతో తారురోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది. హుస్సేనాపురం నుండి నరసమాంబపురం వరకు రూ. 4కోట్ల 10లక్షలతో వ్యయంతో తారురోడ్డు నిర్మాణంకై శంకుస్థాపన చేయడం జరిగినది. కనిగిరి ఆర్.బి రోడ్డు నుండి పద్మాపురం వరకు రూ. కోటి 96లక్షలతో తారురోడ్డు నిర్మాణం కొరకై శంకుస్థాపన చేయడం జరిగినది. తదుపరి ఈ గ్రామలలో ఏర్పాటు చేసిన గ్రామ సభలలో మాట్లాడుతూ.. గ్రామాలలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ పధకాల గురించి వివరించడం జరిగినది.