Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Tue, Feb 19, 2019, 11:59 PM
రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. దేశ భద్రత కోసం ఐక్యంగా పోరాడేందుకు వెనుకాడబోమని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు . పార్టీ ముఖ్యనేతలతో ఉండవల్లిలోని తమ నివాసం నుంచి మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కావాలనే దాడి చేయించారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. . సైనికులకే తమ మద్దతు ఉంటుందన్నారు. కానీ ప్రధాని మోదీ ఏమైనా చేయగల సమర్థుడని, గోద్రాలో నరమేధాన్ని మరువమని విమర్శించారు. దేశ భక్తిలో, భద్రతలో తెదేపా రాజీపడదని స్పష్టం చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వాల అస్థిరత ప్రమాదకరమన్న సీఎం.. ఆ ప్రదేశాల్లో రాజకీయ లబ్ధిని చూడరాదని.. భాజపా రాజకీయాలతోనే జమ్ముకశ్మీర్లో సంక్షోభం ఏర్పడిందని ఆరోపించారు. హైదరాబాద్లో ఆస్తులు ఉన్న నేతలు వైకాపాలో చేరాలని బెదిరిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అలా పార్టీ నుంచి వెళ్లిపోయే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షమేనని ధీమా వ్యక్తం చేశారు. పింఛన్ల పెంపు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. ఈ మూడురోజుల పాటు అన్నదాత సుఖీభవ వేడుకలు నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com