పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన సీఆర్పీఎఫ్ అమర జవాన్ల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. జవాన్లందరూబ్యాంక్ ఖాతాదారులు కావటంతో వారికి డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ కింద ఒక్కొక్కరికి రూ.30 లక్షల బీమా మొత్తాన్ని చెల్లించనున్నట్లు పేర్కొన్నది. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు సహాయం అందచేయాలని తమ ఉద్దేశమని బ్యాంకు యాజమాన్యం ప్రకటించింది.