పోలవరం ప్రాజెక్టుకు 2017 నుంచి కాఫర్ డ్యామ్ కోసం జెట్ గ్రౌటింగ్ చేస్తున్న కెల్లర్ కంపెనీ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. మనదేశంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు జెట్ గ్రౌటింగ్ టెక్నాలజీ వినియోగం ఇదే తొలిసారి అని ఆ కంపెనీ తన నివేదికలో పేర్కొంది. గ్లోబల్ స్ట్రెంత్-లోకల్ ఫోకస్ అనే నినాదంతో పనిచేస్తున్న కెల్లర్ ప్రపంచంలో అత్యుత్తమ టెక్నాలజీని పోలవరం ప్రాజెక్టులో వినియోగిస్తోంది.
నేలలో బలహీనమైన ఇసుక, బలహీనమైన రాతి పొరలు ఉంటే ప్రాజెక్టు నిర్మాణం మీద ఆ ప్రభావం పడకుండా కట్టడాన్ని పటిష్టంగా ఉంచడానికి జెట్ గ్రౌటింగ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రాజెక్టు నిర్మాణం లోపల భూమిలో 10 నుంచి 20 మీటర్ల వరకు డ్రిల్ రిగ్ ద్వారా ద్రవాన్ని పంపడం ఈ ప్రక్రియలో ముఖ్యభాగం.
పోలవరం ప్రాజెక్టు 66% పనుల పూర్తి
పూర్తిచేసిన తవ్వకం పనులు: 4.48 లక్షల క్యూబిక్ మీటర్లు
కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్: 1.73 సి.సి.మీ పనుల పూర్తి (23.61%)
మేనెలాఖరుకు పనుల పూర్తి
కాఫర్ డ్యాం డౌన్ స్ట్రీమ్ : 74 వేల సిసి. మీ (6.8 %) పనుల పూర్తి
ఏప్రిల్ నెలాఖరుకు పనుల పూర్తి.
లక్ష్యాల మేరకు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. పనులు సకాలంలో పూర్తికాకపోతే ఇబ్బందులు వస్తాయని అన్నారు. మడకశిర పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఆయన కోరారు.