2019 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి జనసేన అభ్యర్ధిత్వం కోరుతూ మాజీమంత్రి, జనసేన నాయకుడు రావెల కిశోర్ బాబు స్క్రీనింగ్ కమిటీకి బయోడేటాను సమర్పించారు. పార్టీ నిర్దేశించిన నమూనాలను పూర్తి చేసి సోమవారం విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో కమిటీ సభ్యులకు అందజేశారు. తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చూపించిన దారిలోనే తాము కూడా స్క్రీనింగ్ కమిటీకి బయోడేటాను సమర్పించామని, ఆశావహులు ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ కమిటీకే బయోడేటా సమర్పించాలని తెలిపారు.
విశ్రాంత ఐ.పీ.ఎస్. అధికారి శ్రీ టి.రవికుమార్ మూర్తి బయో డేటా అందజేశారు. సోమవారం ఒక్క రోజే 275 బయోడేటాలు స్ర్కీనింగ్ కమిటీ ముందుకు వచ్చాయి. బయోడేటాలు సమర్పించిన వారిలో విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ జర్నలిస్టులు, గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. కమిటీ సభ్యులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్క దరఖాస్తును సునిశితంగా పరిశీలించారు.