అమరావతి: నీరు-ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నదుల అనుసంధానంతో సత్ఫలితాలు వచ్చాయని అన్నారు.సమర్థ నీటి నిర్వహణలో అధిక దిగుబడులు సాధించామన్నారు. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు చేరాయన్నారు. పలమనేరులో పండుగ వాతావరణం ఏర్పడిందని, రైతులు జలసిరికి హారతి పడుతున్నారన్నారు. ఇంజనీర్లు, సిబ్బంది సమష్టి కృషితోనే సాధ్యమైందన్నారు.