ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమలో మొదలైన తీవ్రత !

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 09:51 AM

రాయలసీమలో ఒక్కసారిగా భానుడి ప్రకోపం మొదలైంది. కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీల వరకూ పెరిగిపోయాయి. కోస్తా ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతిలో నిన్న 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడ్డారు. మరో వారంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 2 నుంచి 3 డిగ్రీల వరకూ అధికమయ్యాయి. పడమర గాలులు వీస్తున్న కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రం రాత్రి పూట చలి కొనసాగుతోంది. వచ్చే రెండు రోజులూ రాయలసీమ, కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా, తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడి, తమిళనాడు వరకూ విస్తరించింది. దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం కురవవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com