అమరావతి: అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. సీఎంను పౌరసరఫరాల శాఖ కమిషనర్ వరప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ధాన్యం సేకరణ ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రైతులకు సహకరించాలని సూచించారు. ధాన్యం సేకరణ వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలన్నారు.