ఇద్దరు యువకులు బైక్ చోరీ చేద్దామని వెళ్లారు.. అనుకున్న ప్లాన్ ప్రకారం బైక్ను కొట్టేశారు. బండిని స్టార్ చేసి జాలీగా అక్కడి నుంచి బయల్దేరారు.. కానీ వాళ్లను దరిద్రం వెంటాడింది. అలా బైక్ చోరీ చేసి కొద్ది దూరం వెళ్లారో లేదో.. ఆ చిన్న తప్పుతో అడ్డంగా దొరికిపోయారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ ఘటన జరిగింది. కదిరిలో ఇద్దరు యువకులు బైక్ చోరీ చేశారు.. అక్కడి నుంచి పారిపోతున్న క్రమంలో పులగంపల్లి దగ్గరకు వచ్చేసరికి బైక్ ఆగిపోయింది. ఏమైందని చూస్తే.. పెట్రోల్ లేదని గుర్తించారు.
పెట్రోలు లేదన్న విషయాన్ని ఇద్దరు యువకులు గమనించలేదు. బైక్ను అలా తోసుకుంటూ వెళుతుండగా స్థానికులు గమనించారు.. వారిద్దరిని గమనిస్తే ఏదో అనుమానం వచ్చింది. వెంటనే ఇద్దర్ని పట్టుకుని నిలదీశారు.. ఇద్దరు యువకులు తడబడ్డారు.. పొంతనలేని సమాధానాలు చెప్పారు. వెంటనే వారిని పట్టుకుని స్తంభానికి కట్టేసి నాలుగు తగలించడంతో అప్పుడు అసలు నిజం చెప్పారు. తాము కదిరిలో బైక్ చోరీ చేసిన విషయాన్ని చెప్పారు. అక్కడి నుంచి పారిపోతున్న క్రమంలో బైక్లో పెట్రోల్ అయిపోయిందన్నారు. వెంటనే పోలీసుల్ని పలిపించి వారికి ఇద్దర్ని అప్పగించారు.
దొంగతనం చేసేటప్పుడే పక్కా ప్లాన్, స్కెచ్ వేసుకొని వెళ్లిన ఇద్దరు యువకులు.. బైక్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకోలేదు. ఆ చిన్న తప్పుతో అడ్డంగా దొరికిపోయారు. చూసుకోవాలి కదా బ్రో.. బైక్లో పెట్రోల్ లేకుండా పార్క్ చేయాలంటూ స్థానికులు సరదాగా నవ్వుకున్నారు. ఈ ఘటన గురించి తెలిసి అందరూ అవాక్కయ్యారు. అంతేమరి ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే తప్పు చేస్తే దొరికిపోవాల్సిందే.