ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందుల పర్యటనకు వెళుతున్నారు. బుధవారం జగన్ తాడేపల్లి నుంచి బయల్దేరి పులివెందులకు చేరుకుంటారు. 19 నుంచి 21 వరకు పులివెందులలోనే ఉంటారు.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశంకానున్నారు. ఏపీ ఎన్నిక ఫలితాలు, ఆ తర్వాత పరిణామాలపై వారితో చర్చించనున్నారు. 21 తేదీ మధ్యాహ్నం పులివెందుల నుంచి బయల్దేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
మరోవైపు వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఈ నెల 19 బదులు ఈ నెల 22న సమావేశం నిర్వహించబోతున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. వైఎస్ జగన్ శనివారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఆహ్వానించారు. వీరితోపాటు ఎంపీలు మినహా పార్లమెంట్కు పోటీ చేసిన అభ్యర్ధులను కూడా ఆహ్వానించారు.
మరోవైపు వైఎస్ జగన్ ఇప్పటికే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, పార్టీ ఎంపీలతో విడి విడిగా భేటీ అయ్యారు. పార్లమెంటరీ నేతగా వైవీ సుబ్బారెడ్డిని (రాజ్యసభ), లోక్సభలో పార్టీ నేతగా మిథున్రెడ్డిని ఎంపికం చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని.. అధికార కూటమికి కాస్త సమయం ఇచ్చి ఆ తర్వాత పార్టీ తరఫున ప్రజా పోరాటం చేద్దామని ఎంపీలకు సూచించారు.