ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నేతలపై దాడుల్ని అరికట్టండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 06:58 PM

ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో టీడీపీ నాయకుడు చిగురుపాటి గిరి కారుపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. కారుపై పెట్రోల్ పోసి తగులబెట్టేశారు. మూడు బాటిళ్లలో పెట్రోల్ తీసుకొచ్చి, ఆ కారుని తగులబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇది కచ్ఛితంగా వైసీపీ మూక చేసిన పనే అని టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈమధ్య వైసీపీ మూకలు తెలుగుదేశం నాయకుల్ని టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని.. చిరుగుపాటి కారుని దగ్ధం చేయడం వెనుక కూడా ఆ పార్టీ పనేనని టీడీపీ వర్గీయులు పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com