అమరావతి : అందుబాటులో ఉన్న మంత్రులతో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. సమావేశంలో మంత్రులు గంటా శ్రీనివాస్, నారాయణ, కాల్వ శ్రినవాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. జగన్ తో తెరాస నేతల భేటీ, 19న కోల్ కతా పర్యటనపై సమావేశంలో చర్చించనున్నారు. రేపు సాయంత్రం చంద్రబాబు కోల్ కతా వెళ్లనున్నారు. మమతా బెనర్జీ నిర్వహించనున్న ర్యాలీలో చంద్రబాబు పాల్గొననున్నారు.